Chiranjeevi: మార్క్ శంకర్‌ను చూసేందుకు సింగపూర్‌కు చిరు దంపతులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తక్షణమే సింగపూర్‌కి బయల్దేరారు. మరోవైపు పవన్ కల్యాణ్ సైతం తనయుడిని చూసేందుకు సింగపూర్‌కు బయలుదేరి వెళ్లారు. మార్క్ శంకర్‌కు మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు సైతం తీసుకున్నారు. చిన్నారికి ధైర్యం చెప్పి అండగా నిలిచేందుకు చిరంజీవి దంపతులు సింగపూర్‌కు వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది. అయితే పనవ్ మాత్రం తన కుమారుడు క్రమంగా కోలుకుంటున్నట్టు నిన్న విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *