Sidhu Jonnalagadda: సిద్దు కీలక నిర్ణయం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

హీరో సిద్దు జొన్నలగడ్డ చేసిన సినిమాలు పెద్దగా లేకున్నా కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరో. మరి అదే కాన్ఫిడెన్సో లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సో కానీ ‘జాక్’ సినిమా చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే కాస్త ఆలస్యమైనా కూడా గొప్ప నిర్ణయం ఒకటి సిద్దు తీసుకున్నాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కోసం సిద్దు జొన్నలగడ్డ రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం.

ఈ సినిమా పరాజయంతో నిర్మాతలకు బాగా లాస్ వచ్చింది. ఈ లాస్‌ను భర్తీ చేయడం కోసం సిద్దు జొన్నలగడ్డ తన రెమ్యూనరేషన్ నుంచి సగం డబ్బును తిరిగిచ్చేయాలని డిసైడ్ అయ్యాడట. అంటే ఈ సినిమా కోసం సిద్దు రూ.4 కోట్లను తిరిగిచ్చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం సిద్దు ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నీరజా కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా సమాచారం. ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చేశాడని తెలుసుకున్న నెటిజన్లు.. సిద్ధు జొన్నలగడ్డపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *