మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే నేడు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్తో పాటు మరో ఇద్దరు నటులతో ప్రెస్మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటించిన ప్రభాస్.. ప్రెస్మీట్కు రాకపోవడంతో పాటు ప్రభాస్ ఫుడ్ గురించి మంచు విష్ణును ఓ విలేకరి ప్రశ్నించగా.. ప్రభాస్కు మొహమాటమని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ భాగమైనందుకు ఆయనకు రుణపడి ఉంటానన్నారు.
ప్రభాస్ మనస్తత్వం తనకు బాగా తెలుసని.. కాబట్టి ఆయన్ని ఇబ్బందిపెట్టే పనులు చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని మంచు విష్ణు తెలిపారు. సినిమాకు ఒక వీడియో బైట్ పంపిస్తా అన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదని తెలిపారు. ప్రభాస్ వల్లే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామని.. ఇందులో తన రోల్ దాదాపు 40 నిమిషాలు ఉంటుందని వెల్లడించాడు. అయితే అందరికీ ఫుడ్ పంపించే ప్రభాస్కి ‘కన్నప్ప’ షూటింగ్లో తనే ఫుడ్ పంపించానని.. తనకు ఏ రేంజ్లో ఫుడ్ పెట్టానో తననే అడిగి తెలుసుకోవాలని మంచు విష్ణు అన్నారు.
ప్రజావాణి చీదిరాల