ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. ఈ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. కుబేర మూవీ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. కొడుకు అక్కినేని అఖిల్ పెళ్లై కొన్ని గంటలు కూడా గడవక ముందే నాగార్జున ‘కుబేర’ కోసం డబ్బింగ్ పూర్తి చేశారు. ఆయన డెడికేషన్ అలా ఉంటుంది మరి. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామోహన్ కలసి మాట్లాడుతున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు. సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన అప్డేట్స్ సైతం సినిమా ఆసక్తికరంగా ఉండబోతోందని చెప్పకనే చెప్పాయి. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల