వేసవిలో వినోదాన్ని పంచుతామంటూ థియేటర్లలోకి ‘మ్యాడ్ స్క్వేర్’ వచ్చింది.
సినిమాలో కథ లేదు.. హాయిగా రెండున్నర గంటల పాటు నవ్వుకునేందుకు థియేటర్స్కి రండంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదలకు ముందే పలుమార్లు చెప్పారు.
చెప్పినట్టుగానే సినిమాలో కథ అయితే ఏమీ లేదు. పోనీ హాయిగా నవ్వుకునేలా ఉందా? అంటే పర్వాలేదు ఒకసారి చూడొచ్చు.
కానీ దాదాపుగా సినిమాకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి.
అయితే కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయని కావాలంటే తన ఫోన్ చెక్ చేసుకోవాలంటూ నాగవంశీ చెబుతున్నారు.
నేడు మీడియాతో మాట్లాడిన ఆయన రివ్యూవర్స్పై విరుచుకుపడ్డారు. ‘డిస్ట్రిబ్యూటర్స్ అయితే నా ఫోన్కు రాంగ్గా పంపించరు కదా. ఎవరికి డౌట్ ఉంటే వారు రండి చూపిస్తా. సవాల్ చేస్తున్నా..
నేను మీ రివ్యూస్ని అంగీకరించినప్పుడు సినిమా ఆడుతుంటే ఆడుతోందని చెప్పండి.
సినిమా నాలుగు రోజులుగా బాగా ఆడుతుంటే.. ఆ న్యూస్ ఒకే ఒక్క వెబ్సైట్లో తప్ప దేనిలోనూ రాలేదు.
మీరు రివ్యూ సరిగా ఇవ్వకుంటే సినిమా బాగా ఆడకూడదా? మీరు బాగా రివ్యూ ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది? మీ రివ్యూ మీరు ఇచ్చారు.
ఆ తరువాత సినిమా బాగా ఆడుతున్నప్పుడు ఆడుతోందని చెప్పడం కూడా మీ జాబే కదా.
అది కాదని మీ రివ్యూని జస్టిఫై చేసుకోవడం కోసం యత్నించడం ఎంతవరకూ సబబు? చాలా మంది సినిమాలో కంటెంట్ లేదు. సీక్వెల్ అడ్వాంటేజ్ ఉందంతే.
సెకండాఫ్ పండలేదు. నేనూ సెకండాఫ్చాలా సార్లు థియేటర్లోచూశాను. పెద్ద హీరో లేడు. అయినా జనం సెకండాఫ్ చూసి థియేటర్లలో అరుస్తూనే ఉన్నారు. ఎందుకంటారు?
మీకు తెలిసినంత జనానికి తెలియలేదా? మీకే ఎక్కువ తెలుసా?’’ అంటూ నాగవంశీ ఫైర్ అయ్యారు.
‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్గా ‘మ్యాడ్ స్క్వేర్’ వచ్చింది. ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు.
కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు.
ఈ చిత్రాన్ని నాగవంశీ సమర్పించారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : అమ్మ మంచితనమే నన్ను ఇక్కడవరకు తీసుకొచ్చింది– ఎమోషనల్ అయిన నటి రజిత