మియాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు…
టాలీవుడ్లో బెట్టింగ్ యాప్ల కలకలం మొదలైంది. గత వారంరోజులుగా ఈ విషయంపై రచ్చ మొదలైంది.
ఈ రోజు వరకు ఆ పేర్లలో సోషల్ మీడియా ఇన్ఫ్ల్యన్సర్స్ పేర్లు మాత్రమే వినిపించాయి.
ఈరోజు మాత్రం టాలీవుడ్ని షేక్ చేసే పేర్లు వినపిస్తుండటంతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ముఖ్యంగా రానా దగ్గుబాటి తన పేరు బయటకు రావాటంతో మీడియాకి వివరణ ఇచ్చారు.
‘‘తాను ప్రభుత్వం అనుమతించిన చట్టబద్దమైన యాప్లకే ఆమోదం తెలిపి జెంగిల్రమ్మి.కామ్ని ప్రమోట్ చేశాను .
2017లోనే వాటి గడువు ముగిసింది’’ అన్నారు. ఇంకా టాలీవుడ్లోని పలు పేర్లు ఈ లిస్ట్లో చేరాయి.
వారిలో ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల,
సిరి హనుమంతు, విష్ణు ప్రియ, శ్యామల, రీతూ చౌదరి, శ్రీముఖి, వర్షిణి సౌందరాజన్, నయని పావని,
ఢీ డాన్సర్ పండు, హర్షసాయి, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, భయ్యా సన్నీ యాదవ్, శోభా శెట్టి, వసంతి కృష్ణన్, అమృతా చౌదరి, టేస్టీతేజ తదితరులపై కేసు నమోదైంది….
వీరందరిపై పి.యం ఫణీంద్ర శర్మ మియాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదుచేశాడు.
శివమల్లాల
Also Read This : అందుకే హిమాలయాలకు పారిపోయేవాడిని
