#SSMB29 కోసం హైదరాబాద్ కు చేరుకున్న ప్రియాంక చోప్రా

రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ #SSMB29. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా క్షణాల్లో వైరలవుతోంది.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో తాజాగా నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకోవడం నెట్టింట వైరల్ గా మారింది.

హైదరాబద్ ఎయిర్ పోర్ట్ లో ప్రియాంక తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కనిపించారు.

దీంతో మహేశ్‌- రాజమౌళి #SSMB29 ప్రాజెక్ట్ కోసమే ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇటీవలే చిత్రబృందం పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు.

అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.ఎల్‌.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇందులో మహేష్ బాబు ఇదివరకు ఎన్నడూ కనిపించని విధంగా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.

సంజు పిల్లలమర్రి

Also Read This : RC 16 సినిమా స్టోరీ లో మార్పులు చేసిన చిరంజీవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *