ఇరవయ్యేళ్ల క్రితం వరకు ఆడియో ఫంక్షన్స్ అంటే క్యాసెట్స్ను విడుదల చేసేవారు. ఆ క్యాసెట్స్ను టేప్రికార్డర్లలో పెట్టుకుని పాటలు ఎంజాయ్ చేసేవారు సంగీత ప్రేమికులు. విడుదలైన ఆడియో పాటలు బావుంటే ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ చేసేవారు. మహేశ్బాబు హీరోగా నటించిన ‘అర్జున్’ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో మహేశ్బాబుతో పాటు హీరో ప్రభాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు శ్రియాసరన్, కీర్తిరెడ్డి, దర్శకులు గుణశేఖర్, సుకుమార్, యం.యస్ రాజులతో పాటు ఆర్ట్డైరెక్టర్ తోటతరణి, బాలు, మణిశర్మ తదితరులు పాల్గొన్నారు. మహేశ్ వదిన రమేశ్బాబు భార్య మృదుల మరియు రమేశ్బాబు కుమారుడు జయకృష్ణ. మహేశ్బాబు గ్రాండ్మదర్ దుర్గమ్మ పాల్గొన్నారు. పర్ఫెక్ట్ నోస్టాలిజిక్ రేర్ ఇమేజెస్ ఇన్ ట్యాగ్తెలుగు.కామ్.
శివమల్లాల
Also read this : సుకుమార్ నిజంగా అంత స్వార్థపరుడా?