Vijay Devarakonda: ఈ యుద్ధం కూడా అలాంటిదే..

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా అవుట్‌పుట్ పట్ల సంతృప్తిగా ఉన్నామని బుకింగ్స్‌కి వస్తున్న రెస్పాన్స్ ఆనందాన్నిస్తోందన్నాడు. తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న భరోసాతోనే తాను ప్రశాంతంగా ఉండగలుగుతున్నట్టు విజయ్ దేవరకొండ తెలిపాడు. ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయని.. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుందన్నాడు. ఈ యుద్ధం కూడా అలాంటిదేనని వెల్లడించాడు.

కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని.. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు ‘కింగ్‌డమ్’ ప్రపంచంలోకి వెళ్తారని విజయ్ దేవరకొండ తెలిపాడు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుందని విజయ్ పేర్కొన్నాడు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. “ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము పాస్ అయ్యాము. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది. అన్నారు.

కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ లో మధు అనే కథకు కీలకమైన పాత్ర పోషించాను. గౌతమ్ గారు పాత్రను అద్భుతంగా మలిచారు. విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అని తెలిపింది.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *