అభిజ్ఞా, చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్సిరీస్ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’. ‘రెక్కీ’ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించిన కృష్ణ పోలూరు ఈ వెబ్ సిరీస్కు సైతం దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి జీ5 (ZEE 5) వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ను విడుదల చేశారు. ముఖ్య అతిథిగా ఒక పిరియాడిక్ కథను వెబ్ సిరీస్గా రూపొందించారు. 1980ల నాటి మారుమూల భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో ప్రతి ఒక్క అమ్మాయి పెళ్లి రోజున రక్తం కక్కుకుని మరణిస్తూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? అసలు ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి? దశాబ్ద కాలంగా ఆ గ్రామంలో ఎందుకు వివాహాలు జరగడం లేదు? పీసీ మీనా ఆ గ్రామానికి వచ్చి ఆ భయాలను తొలగించిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలతో సాగే కథగా ఈ సిరీస్ రూపొందినట్లు ట్రైలర్ ఆధారంగా తెలుస్తోంది.
ప్రజావాణి చీదిరాల