పహల్గాం ఘటనపై విజయదేవరకొండ ఆసక్తికర కామెంట్స్

కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడుల క్రూర చర్యను దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌పై హీరో విజయ్ దేవరకొండ సైతం తాజాగా బ్రేవ్ కామెంట్స్ చేశాడు. నిన్న సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ దేవరకొండ హజరయ్యాడు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘పహల్గాం దాడి ఘటన బాధాకరం. వారి బాధను పంచుకోలేకున్నా.. మనమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్‌లో జరుగుతున్న దురాగతాలన్నింటికీ కారణం చదువు లేకపోవడమే కాబట్టి వారందరికీ చదువు చెప్పించి బ్రెయిన్ వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలి.

కశ్మీర్ మనదే.. అక్కడి ప్రజలు మనవాళ్లే. ‘ఖుషి’ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో చేసినప్పుడు అక్కడి ప్రజల గురించి తెలుసుకున్నా. వారంతా చాలా మంచివారు. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి చర్యలతో ఉగ్రవాదులు సాధించేదేమిటో తెలియడం లేదు. పాకిస్థాన్‌లో కరెంటు, నీళ్లు లేవు. అలాంటి పరిస్థితిలో అక్కడి సంగతి చూసుకోకుండా ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో తెలియడం లేదు. పాక్‌పై ఇండియా దాడి చేయాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు పోతే.. కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌కు ఆ దేశ ప్రజలే బుద్ధి చెబుతారు’’ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *