ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుతున్నాడు. అయితే తాజాగా మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జిరగింది. ఈ ఘటనలో శంకర్కు గాయాలయ్యాయి. మార్క్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. వెంటనే మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ పర్యటనను నిలిపివేసి సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అల్లూరి జిల్లా వాసులకు ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి.. ఆపై అభివృద్ది పనులను పూర్తి చేసిన మీదటే సింగపూర్కు పయనమవుతానని పవన్ తెలిపారు.
ప్రజావాణి చీదిరాల