బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి రావడం చాలా కష్టం. ఒకవేళ వచ్చినా కూడా నిలదొక్కుకోవడం మరింత కష్టం.
ఈ కష్టాలన్నింటినీ అధిగమించి హీరోగా సంపూర్ణేష్ బాబు నిలదొక్కుకున్నాడు.
వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నాడు
అందరి హీరోల సినిమాలకు భిన్నంగా చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకున్నాడు.
సంపూ ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అవుతోంది. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని ‘సోదరా’ అంటూ వచ్చేస్తున్నాడు.
మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గతంలో అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సినిమా చేసిన సంపూ.. తిరిగి సరికొత్తగా మరోసారి అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యాడు.
సంపూర్ణేష్ బాబుతో పాటు ముఖ్య పాత్రల్లో సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా నటిస్తున్నారు.
ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 25న విడుదల కానుంది.
ఈ క్రమంలోనే గురువారం తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
సినిమా నేపథ్యం వివరించి సినిమాను వీక్షించేందుకు గవర్నర్ను సంపూర్ణేష్ బాబు ఆహ్వానించారు.
సమయం చూసుకుని తప్పక సినిమా చూస్తానని గవర్నర్ సైతం తెలిపారు. సంపూర్ణేష్ బాబుకి బెస్ట్ విషెస్ తెలిపారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘అర్జున్ S/O వైజయంతి’ ఎప్పుడు వస్తున్నాడంటే..
