ఆస్థి పంపకాల్లో మనోజ్ పై మోహన్ బాబు దాడి

నటుడు మంచు మోహన్‌బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయ్.

నిన్న మధ్యాహ్నం మంచు మనోజ్ మరియు తన సతీమణి మౌనిక రెడ్డి మీద దాడికి పాల్పడ్డారని

ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు.. అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూలుకు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తాయి

మోహన్‌బాబు అనుచరులైన వినయ్‌ ఇతర బౌన్సర్లు మనోజ్‌పై, ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరచినట్లు తెలిసింది.

ఆ గాయాలతోనే మనోజ్‌ తన భార్యతో కలసి పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు .

ఈ విషయంపై మహేశ్వరం డీసీపీని సంప్రదించగా డయల్‌-100కు కాల్‌ వచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా..

కాలుకు గాయం అయిన మంచు మనోజ్‌ తన భార్య మౌనికతో కలసి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చారు.

తండ్రితో గొడవ విషయంపై మీడియా ప్రశ్నించగా మనోజ్‌, మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు.

అయితే ఇప్పుడు మరో కొత్త విషయం బయటకు వచ్చింది. పదునైన ఆయుధాలతో దాడి చేశారన్న మెడికల్‌ ప్రూఫ్స్ కోసం మంచు మనోజ్‌ నిన్న ఆస్పత్రికి వెళ్లినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.

కాగా వైద్యులు ఇదే విషయాన్ని గుర్తించి మెడికో లీగల్‌ కేసుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇవాళ మధ్యాహ్నం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు.

మెడికో లీగల్‌ కేసు అయితే మొదట పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మనోజ్‌పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు ఆసుపత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చింది.

బలమైన దెబ్బలు తగిలాయని, దాడి చేసినట్లుగా ఉందని రిపోర్టు ఇచ్చారు వైద్యులు.

Also read this : పుష్ప 2 కి పోటీగా మా సినిమా రిలీజ్ చేస్తున్నాం

Chandrabose Exclusive interview
Chandrabose Exclusive interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *