సమంత, నాగచైతన్య మళ్లీ కలిసి కనిపిస్తే చూడాలని అభిమానులంతా ఎంతగానో తపిస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులు ఫలించబోతున్నాయా? లేదంటే దానికి ఛాన్సే ఉండదా? వీరిద్దరి కెరీర్లో మరచిపోలేని చిత్రం ‘ఏ మాయ చేసావే’. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతోనే సమంత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సమంత, నాగ చైతన్యల ప్రేమకు కూడా ఈ చిత్రమే బీజం వేసింది. అంతేకాకుండా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇన్ని ప్రత్యేకతలున్న చిత్రం కాబట్టే సమంత, నాగచైతన్యలకు ఇది వెరీ స్పెషల్.
పలు ఇంటర్వ్యూల్లో సమంత కూడా ఇదే తన ఫేవరెట్ చిత్రమని వెల్లడించింది. అసలు ఈ టాపిక్ ఇప్పుడెందుకంటే.. ఏం మాయ చేసావే చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. జూలై 18న రీరిలీజ్కు సిద్ధమవుతోంది. 15 ఏళ్ల తర్వాత విడుదల కానున్న ఈ చిత్రం కోసం మేకర్స్ ప్రమోషన్స్ అయితే చేస్తారు. మరి ఆ ప్రమోషన్స్లో వీరిద్దరూ కలిసి పాల్గొంటారా? లేదా? అనేది ఎవరికీ తెలియకుండా ఉంది. ఒకసారి వీరిద్దరూ ఒకే వేదికను పంచుకుంటే చూడాలని ఫ్యాన్స్ అంటున్నారు. ఇది గానీ జరిగతే సినిమాకు దీన్ని మించిన ప్రమోషన్ అక్కర్లేదు. మాజీ భర్తను కలిసేందుకు సమంత ఇష్టపడుతుందా? అసలు భర్తను పంపేందుకు శోభిత ఇష్టపడుతుందా? ఇలా నెట్టింట ఎన్నో ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. మరి కలుస్తారా? చూడాలి.