ఫోటోతో గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు ఇన్‌స్టాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టారు. అది చూసిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని అధికారికంగా ప్రకటించేశారు. జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకోబోతున్నట్టు లావణ్య వెల్లడించారు. అది చూసిన నెటిజన్లు శుభాకాంక్షలతో ఇన్‌స్టాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సైతం వరుణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సమంత, రకుల్, రీతూ వర్మ, డింపుల్ హయాతి తదితరులంతా కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

2017లో వరుణ్, లావణ్యల మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది. ఆపై వీరిద్దరూ 2023లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం వరుణ్ తేజ్ తిరిగి సినిమాల్లో బిజీ అవగా.. లావణ్య మాత్రం ఒక వెబ్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ‘సతీ లీలావతి’తో పాటు కోలీవుడ్ మూవీ థనల్‌ను పూర్తి చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత బ్రేక్ ఇచ్చిన లావణ్య తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో సినిమాలకు ఆమె దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *