...

“ఇక పైన బెనిఫిట్ షోలు ఉండవు ” సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌షోలు ఉండవు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బెనిఫిట్, ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అని తేల్చి చెప్పేశారు.

హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోలపై క్లారిటీ ఇచ్చేశారు.

అసెంబ్లీలో చెప్పిన దానికే తాము కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని అభిప్రాయపడ్డారు.

ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్, ప్రీమియర్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి బల్ల గుద్ది మరి చెప్పారు.

మరోవైపు స్పెషల్‌గా సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ఉండదని చెప్పుకొచ్చారు. అయితే సినీ ప్రమఖులు ఈ అంశంపై ఆలోచించాలని కోరినట్లు తెలుస్తోంది.

త్వరలోనే టికెట్ల పెంపుపై ఓ ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతిభ్రదల విషయంలో రాజీ లేదని పేర్కొన్నారు.

ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని.. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనప్పటికీ సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాట కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

అభిమానులతో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్, కుటుంబ సమేతంగా సంధ్య థియేటర్‌కి రావడంతో జనం పోటెత్తారు.

అల్లు అర్జున్ రాగానే అతన్ని చూసేందుకు జనం ఎగబడడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ అక్కడికక్కడే ఓ మహిళ మృతి చెందింది. మరో చిన్నారి, ప్రాణాపాయ స్థితితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ సంఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోస్‌కి అనుమతి ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రాలో సినిమా బిజినెస్ పూర్తిగా పడిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో ఆంధ్రాలో కలెక్షన్లు ఘోరంగా ఉండేవి.

టికెట్ ధరలు కనీస స్థాయికి తగ్గించడం, హైక్స్ ఇవ్వకపోవడం, బెనిఫిట్ షోస్‌కి అనుమతి ఇవ్వకపోవడంతో ‘RRR’వంటి సినిమాలకు కూడా ఆంధ్రాలో నష్టాలు తప్పలేదు.

అయితే తెలంగాణలో మాత్రం ప్రతీ పెద్ద సినిమాకి హైక్స్ లభించాయి. అడిగినంత హైక్స్ ఇవ్వడంతో పాటు రోజుకి 5 షోస్, 6 షోస్ ప్రదర్శించేందుకు కూడా గత కేసీఆర్ ప్రభుత్వం అనుమతిస్తూ వచ్చింది..

గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలుచేస్తూ వచ్చింది. ‘కల్కి 2898AD’ మూవీతో పాటు ‘దేవర’ వంటి సినిమాలకు టికెట్ హైక్స్‌తో పాటు బెనిఫిట్ షోస్ వేసుకునేందుకు అనుమతి వచ్చింది.

‘పుష్ప 2’ మూవీకి 4 రోజుల పాటు రోజూ 6 షోస్ వేసేలా అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ముందు రోజు రికార్డు స్థాయిలో ప్రీమియర్స్ కూడా పడ్డాయి.

అయితే సంధ్య థియేటర్ విషాద సంఘటనతో ఇకపై బెనిఫిట్ షోస్‌కి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వచ్చే సంక్రాంతికి విడుదల అవుతున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడనుంది.

సంజు పిల్లలమర్రి

Also Read This : గేదెలరాజు కాకినాడ తాలూకా ఏంటిది ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.