‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత మరో వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతోంది. అదే.. ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న జీ5లో ప్రీమియర్ కానుంది. గ్రామీణ వాతావరణం, ప్రకృతి సౌందర్యాల నడుమ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ ప్రదర్శితం కానుంది. గ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్గా సాగే ఇన్వెస్టిగేషన్ అన్నీ కలిపి సీటు అంచున కూర్చునేలా ఈ వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు.
1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఒక పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ వూతలూరు) ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది. మూఢనమ్మకాలతో ఓ శక్తివంతమైన సందేశంతో ఉత్కంఠ భరితమైన ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ రాబోతోంది. ఇది కేవలం సూపర్నేచురల్ థ్రిల్లర్ మాత్రమే కాదు భయం, సత్యం మధ్య జరిగే ఓ యుద్ధంగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది.
ప్రజావాణి చీదిరాల