వెంకటేశ్, మహేశ్బాబులు పెద్దోడు చిన్నోడులా చేసిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విడుదలై దాదాపు పుర్కరం అంటే పన్నెండేళ్లుదాటింది. అయినా కూడా ఆ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. మార్చి 7వ తారీకున ఈ సినిమాను థియేటర్లలో మరోసారి విడుదల చేస్తున్నారు ‘దిల్’ రాజు. అప్పుడు అంటే అసలు సిసలు మల్టీస్టారర్ ఈ సినిమా అని చెప్పి థియేటర్లు నింపేశారు అన్నారు. మరి మళ్లీ ఆ ఫీట్ కొనసాగుతూ హైదరాబద్లో ఇప్పటికే దాదాపు పది థియేటర్లు పైగానే హౌస్ఫుల్స్ అయ్యాయట. ఓ పక్క టివీల్లో సినిమా ఉంది. ఓటిటి ప్లాట్ఫామ్స్లో కూడా సినిమా ఉంది. అయినాకూడా సినిమా ఎందుకు ఫుల్స్ అవుతందబ్బా? అనుకుని మనలో మనమే క్వశ్చన్ చేసుకునే చాలామంది ఉంటారు. దానికి కారణాలు వెరీ సింపుల్ స్టార్ హీరోల ఫ్యాన్స్..అలాగే మహేశ్బాబు సినిమా మరో రెండేళ్లు థియేటర్లో ఉండదు అనే విషయం అందరికి తెలుసు. తన ఫ్యాన్స్ ఇలా ఆలోచిస్తుంటే వెంకీమామ ఫ్యాన్స్ మరోలా ఆలోచిస్తున్నారు. వెంకీ ఫుల్స్వింగ్లో ఉండి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ వద్ద నయా లెక్కలు తిరగరాశారు. అప్పుడు చాలామంది చిన్న పిల్లలుగా ఉన్నవారు ఇప్పుడు టీనేజ్లో ఉన్నారు. వారందరికి థియేటర్కి వెళ్లి ఓ సారి మహేశ్ను, వెంకీని చూడాలనుకొని టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారట. ఈ కారణాలే కాకుండా మార్చి 7 వతేదిన తెలుగు సినిమాలతో డబ్బింగ్ అన్ని సినిమాలు కలిపి విడుదలయ్యే సినిమాల సంఖ్య దాదాపు 14. వీటిలో ఒక్కటికూడా పెద్ద సినిమా స్టార్ సినిమా లేకపోవటంతో స్టార్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు తెలివిగా ఆలోచించి మరోసారి సినిమాను విడుదల చేస్తున్నారు. ఇదన్నమాట అసలు సంగతి అని అందరూ నోరెళ్లబెట్టకండి…ఇదేసంగతి..సంగతి ఏదైనా స్టార్ఇమేజ్ అంటే ఇది..దెబ్బకు హౌస్ఫుల్స్…
శివమల్లాల
Also Read This :ఆమని కెరీర్లో గుర్తుంచుకునే సినిమా ‘నారి’..