విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి 35 ఏళ్ల తర్వాత వైజయంతి ఐపీఎస్గా కనిపించి మెప్పించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇవాళ (ఏప్రిల్ 18)న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ క్రమంలోనే నేడు సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘అమ్మ(విజయశాంతి)తో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ గారి పాత్రకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.క్లైమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్. ఇవాళ పొద్దున్నే మా అబ్బాయి సినిమా చూసి ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని చెప్పడంతో నేను షాక్ కి గురయ్యాను. మదర్ సన్ మధ్య ఉన్న ఎమోషన్ కి ఆడియన్స్ అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ ప్రదీప్ గారు మొత్తం క్రెడిట్ కొట్టేశారు’’ అన్నారు.
యాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… ‘‘ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. అది ఈ రోజు నిజమైంది. కళ్యాణ్ రామ్ గారితో కలిసి ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని తీయడంతో ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఇందులో తల్లీకొడుకుల సెంటిమెంటు, కొడుకు బాధ్యతను అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది’’ అని అన్నారు. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా మేము ఎవరికి రీచ్ అవుతుందని అనుకున్నామో వారికి ఇంత మ్యాసీవ్ గా రీచ్ కావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ రెస్పాన్స్ కి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. నిర్మాత సునీల్ బలుసు మాట్లాడుతూ… ‘‘ఈవినింగ్ నుంచి అన్నిచోట్ల షోలు యాడ్ అవడమనేది చాలా అరుదుగా జరిగే సినారియో. ఇంత మంచి సినిమాలో పార్ట్ కావడం వెరీ హ్యాపీ’’ అని తెలిపారు.