పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ మెరుపు దాడులు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఈ దాడిపై భారత్లోని ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినీ నటులంతా దీనిపై స్పందించారు.
చిరంజీవి: ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. జైహింద్
పవన్ కల్యాణ్: ఎన్నో రోజుల నిశ్శబ్దం తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ భారతదేశం మొత్తంలో స్ఫూర్తిని నింపింది. త్రివిధ దళాల ధైర్యంతో పాటు ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించి సైన్యానికి అండగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు. మేమంతా మీతోనే ఉన్నాం
రజినీకాంత్: ఇప్పుడు ప్రారంభమైన పోరాటం.. లక్ష్యం పూర్తయ్యేవరకూ ఆగదు. దేశం మొత్తం మీతో ఉంది. జైహింద్
మమ్ముట్టి: రియల్ హీరోలకు సెల్యూట్. ‘ఆపరేషన్ సిందూర్’తో దేశం కోసం ఇండియన్ ఆర్మీ ఏం చేయగలదో మరోసారి రుజువైంది.
కమల్ హాసన్: సాయుధ దళాలు ఒక్కటవడం చాలా గర్వంగా ఉంది. భారత ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక సైనిక చర్యను అభినందిస్తున్నా
మహేశ్ బాబు: తగిన న్యాయం జరిగింది. మేరా భారత్ మహాన్. సైనికులకు సెల్యూట్
ఎన్టీఆర్: మన ఆర్మీ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. జైహింద్
అల్లు అర్జున్: న్యాయం జరిగింది… జైహింద్
ఖుష్బూ: న్యాయం జరిగింది. భారత్ మాతా కీ జై
నాని: ఆపరేషన్ సిందూర్.. జైహింద్
శివకార్తికేయన్: భారతసైన్యమంటే ఇది. జైహింద్
కల్యాణ్ రామ్: పహల్గాం ఉగ్రదాడికి సమాధానమే ‘ఆపరేషన్ సిందూర్’
విజయ్ దేవరకొండ: ప్రజల భద్రత కోసం ప్రార్థిద్దాం. ఈ ఉగ్రవాదం, దాడులు అనే పదాలు లేకుండా ప్రజలు ప్రశాంతమైన జీవితాలను గడిపే రోజు కోసం ఎదురుచూస్తున్నా. జై హింద్
విశ్వక్సేన్: ప్రస్తుతం ప్రతి కదలిక పైనా దృష్టిపెట్టి అన్నిటినీ నిశితంగా పరిశీలించాలి