ఈ ఏడాది మూడు సినిమాలతో బెల్లంబాబు బిజీబిజీ…

Bellamkonda Srinivas :

2014లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ‘అల్లుడుశీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీఇచ్చిన నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.

చేసిన తొలి చిత్రంతోనే మంచి డాన్సర్, ఫైటర్‌ అని పేరు తెచ్చుకున్నారు శ్రీను.

ఆ ఊపులోనే తన సినిమాలన్నీ హిందీలోకి డబ్‌ అవ్వటంతో అక్కడకూడా సాయి శ్రీనివాస్‌కి మంచి పేరొచ్చింది.

తన సినిమాలన్నీ బాలీవుడ్‌ మార్కెట్‌లో ముఖ్యంగా డబ్బింగ్‌ మార్కెట్‌లో టాప్‌హీరో బెల్లంకొండ అయ్యాడు.

వరుసగా ‘స్పీడున్నోడు’, ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘కవచం’, ‘సీత’, ‘రాక్షసుడు’ సినిమాలు చేశాడు.

ఐదేళ్లలో ఏడు సినిమాలు చేసి మంచి జోరుమీదున్నాడు అనుకున్నారంతా.

కట్‌చేస్తే ‘అల్లుడు అదుర్స్‌’తో ఫ్లాప్‌ రావటం ప్రభాస్‌ ‘చత్రపతి’ చిత్రాన్ని బాలీవుడ్‌లో తీయటంతో తెలుగులో కొంచెం బ్రేక్‌ వచ్చింది.

అందుకే బెల్లంబాబు ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నట్లుగా కనిపించారు. 2025 సాయి శ్రీనివాస్‌కి లక్కీ అనిపిస్తుంది.

‘నాంది’ దర్శకుడు విజయ్‌ కనకమేడల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భైరవం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

2025లో శ్రీను నటించిన మరో రెండు సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

‘హైందవ’ చిత్రం దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది.

శ్రీను టైటిల్‌రోల్‌లో నటిస్తోన్న ‘టైసన్‌నాయుడు’ కూడా ఈ ఏడాది విడుదల అవుతుందట.

మొత్తానికి 2025 బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కెరియర్‌కి బిగ్‌బ్రేక్‌ అని చెప్పాలి.

ఫ్యాన్స్‌ని ఉద్ధేశించి బెల్లంబాబు గెట్‌ రెడీ డియర్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.

శివమల్లాల

Also Read This : డియర్‌ నిర్మాతల్లారా….వెల్‌కమ్‌ టు ద ఇండస్ట్రీ

Music Director Gowra Hari Exclusive Interview
Music Director Gowra Hari Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *