ఈ కథ పరమశివుడే నాతో రాయించాడు

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారిగా నాగ సాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల 2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నినర్మించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటుడు వశిష్ట ఎన్ సింహ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడున్న ‘ఓదెల-2’ ఫ్యామిలీ అందరికీ మంచి జరగాలి అని కోరుకునే సభ్యులున్న చాలా మంచి ఫ్యామిలీ. దేవుడి శక్తి తెలియాలంటే దుష్టశక్తి గురించి కూడా తెలియాలి. రివ్యూస్ లాంటి నెగిటివిటీ కూడా అలాంటిదే. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చకుంటే క్లైమాక్స్‌లో శివుడి దర్శనం జరిగేటప్పుడు ఆడియన్స్ దేవుడికి దణ్ణం పెట్టరు’’ అని అన్నారు.

ఓదెల-2 క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ..‘‘ఏడాదిన్నర క్రితం ఈ సినిమా జర్నీ ప్రారంభమైన నాటి నుంచి ఈ రోజు వరకూ ఏదో జరిగింది. ఏదీ మేము ప్లాన్ చేయకుండానే దానంతట అదే జరిగిపోయింది. పరమశివుడి ఐడియా చెప్పగానే నిర్మాత మధు గారు వెంటనే ఓకే చేశారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నటీనటుల విషయానికి వస్తే సీక్వెల్ అనుకోగానే తమన్నాను అనుకున్నాం. ఆమె 20 ఏళ్ల కెరీర్ ఒకవైపైతే.. ఈ క్యారెక్టర్ మరోవైపు. వశిష్టగారు ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేశారో తెలియదు కానీ ఇకముందు మాత్రం అద్భుతమైన పాత్రలు వస్తాయి. బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు..‘మనం ఎదిగామని మనమే చెప్పుకోవాలి. మన గురించి ఎవరూ చెప్పరు’ అని. ఇప్పటి వరకూ నేను నా గురించి చెప్పుకోలేదు కానీ ఈ సినిమా గురించి మాత్రం చెప్పాలనుకుంటున్నా. ఈ కథ పరమశివుడే నాతో రాయించాడు. శివుడు కనిపించినప్పుడు వాళ్ల ఫీలింగ్ కొందరు నాకు ఫోన్ చేసి చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని తెలిపారు.

నిర్మాత మధు మాట్లాడుతూ..‘‘సంపతి నంది గారు, నేను కలిసి ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నట్లుగానే మంచి భక్తిభావం ఉన్న సినిమాను తీశాం. ఈ సినిమా ద్వారా కాశీని చూశాం. మహాకుంభమేళాలో టీజర్ లాంచ్ చేశాం. నా జీవితంలో ఈ సినిమా ద్వారా ఎన్నో ఊహించని ఘటనలు జరిగాయి. కొన్ని రివ్యూస్.. ప్రేక్షకుల ఫీలింగ్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ రివ్యూస్.. సినీ ప్రపంచం నాకు కొత్తగా అనిపిస్తోంది. రివ్యూయర్స్ కంటే ప్రేక్షకుల అభిప్రాయమే మాకు ముఖ్యం. వారంతా సినిమా చూసి చాలా బాగుందని చెబుతున్నారు’’ అన్నారు. డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ..‘‘సినిమా బాగుంటేనే కలెక్షన్స్ పెరగడం జరుగుతోంది. మౌత్ టాక్ స్ప్రెడ్ అడమనేది మా ఓదెల-2కి జరుగుతోంది. రివ్యూ అనేది ఒకరి అభిప్రాయం. కానీ మేము సినిమా తీసింది అందరికోసం’’ అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *