దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభానికి ముందే మహేష్ పాస్పోర్టును రాజమౌళి సీజ్ చేశారు.
టైం దొరికినా.. దొరకకున్నా.. వీలు చిక్కించుకుని మరీ ఫ్యామిలీతో కలిసి ట్రిప్పులేసే మహేష్..
రాజ మౌళి తన పాస్పోర్టును సీజ్ చేయడంతో సైలెంట్ అయిపోయారు. తాజాగా మహేష్ చేతికి తిరిగి పాస్పోర్టు వచ్చింది.
ఆ పాస్పోర్టును చూపిస్తూ మహేష్ ఎటో వెళుతున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే ఒడిశా షెడ్యూల్ పూరై్తన విషయం తెలిసిందే.
కాస్త గ్యాప్ దొరకడంతో రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి ఎటో పయనమయ్యాడు.
అలా వెళ్లే క్రమంలో మహేష్ తన పాస్పోర్టును చూపిస్తున్న ఫోటో వైరల్ అవుతోంది.
మొత్తానికి మహేష్ ఏదో కన్వే చేద్దామనుకుంటే అది కాస్తా సైడ్ అయిపోయి మహేష్ చేతికి పాస్పోర్టు వచ్చిన విషయాన్ని మాత్రం మీమర్స్ పరిగణలోకి తీసుకున్నారు.
అంతే.. మీమ్స్ ఈ విషయమై ఊపందుకున్నాయి.
‘పాస్పోర్టు నా చేతికి వచ్చింది.. ఇక నన్నెడవడూ ఆపలేడు’ అని..
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్కు విక్టరీ వెంకటేష్ జాగ్రత్తలు చెబుతున్న వీడియోను పెట్టి నెటిజన్లు నానా రచ్చ చేస్తున్నారు.
మీమ్స్ మాత్రం కడుపుబ్బ నవ్విస్తున్నాయి.
ప్రజావాణి చీదిరాల
