వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ ‘విశ్వదర్శనం’.
ఆ బంగారు దర్శకుడు భారతదేశం గర్వించే గొప్ప దర్శకుడు కె.విశ్వనాథ్ గారు.
ఆయన బయోపిక్ను ఒక డాక్యుమెంటరీలా ప్రముఖ రచయిత దర్శకుడు జనార్ధన మహర్షి ఎంతో శ్రద్ధతో తెరకెక్కించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత ఈ డాక్యుడ్రామాను నిర్మించారు.
ఫిబ్రవరి 19 కె.విశ్వనాద్గారి జన్మదినం.
విశ్వనాద్గారి జయంతి సందర్భంగా ‘విశ్వదర్శనం’ ప్రోమోను విడుదలచేశారు దర్శక నిర్మాతలు.
ఈ ప్రోమోలో విశ్వనాద్ గారితో పనిచేసిన అతిరథమహారధులు ఎందరో ఆ మహా దర్శకునితో తనకున్న అనుభవాలను పంచుకున్నారు.
అలాగే విశ్వనాద్గారి సతీమణి జయలక్ష్మీగారు మొదటిసారి కెమెరాముందుకు వచ్చి
విశ్వనాద్గారి పక్కన కూర్చుని ఆయనతో తనకున్న అనేక రకాలైన ఎమోషన్స్ను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారని దర్శక,నిర్మాతలు తెలిపారు.
Also Read This : క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్..నేను ఏం చేయగలను– దర్శకుడు ధన్రాజ్ కొరనాని