నటుడు విజయ రంగరాజు ఇక లేరు

ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్‌ కుమార్‌ కన్నుమూశారు.

చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇటీవలే రంగరాజు హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ట్రీట్మెంట్‌ కోసం చెన్నై వెళ్లారు.

బాలకృష్ణ నటించిన భైరవద్వీపంతో పాపులర్‌ అయ్యారు.

తర్వాత యజ్ఞం, సీమ శాస్త్రి, జాంబిరెడ్డి, ఢమరుకం, శ్లోకం, మగరాయుడు, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, సహా పలు సినిమాల్లో విజయ రంగరాజు నటించారు.

రంగరాజుకు ఇద్దరు కూతుళ్లు. రంగరాజు ఎక్కువగా విలన్ పాత్రలు పోషించారు.

1994 లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారాయన.

గోపీచంద్ హీరోగా నటించగా యజ్ఞం చిత్రంలో విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

రంగరాజు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫైటర్ గా ఆయన 5 వేలకు పైగా సినిమాల్లో నటించారు.

ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

సంజు పిల్లలమర్రి

Also read this : అదే నా మైనస్ అన్నారు : దివి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *