Delhi Liquor Scam :
ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోత్ కు ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడంలేదు. ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేతలు, ఢిల్లీ మంత్రులందరి మెడకూ చుట్టుకుంటోంది. రెండు సంవత్సరాలుగా సీరియల్ గా సాగుతున్న ఈ కేసులో మొదట ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ.. ఆ తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను జైలుకు పంపించింది.
ఇటీవలే ఢిల్లీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సైతం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఢిల్లీ మంత్రికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో మరో కీలక మంత్రి అయిన కైలాశ్ గహ్లోత్కు ఈడీ శనివారం నోటీసులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో కైలాశ్ గహ్లోత్ హోం రవాణా, న్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కోసం శనివారం రోజే తమ ముందు హాజరుకావాలని గహ్లోత్ కు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. దీంతో గహ్లోత్ ను విచారించి వదిలేస్తారా? లేక కేజ్రీవాల్ లాగే అరెస్టు కూడా చేస్తారా? అన్న ఆందోళన ఆప్ పార్టీ వర్గాలల్లో నెలకొంది.
ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ముందు సంచలంగా మారింది. తమను లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుకునేందుకు ఈడీ దర్యాప్తు పేరిట బీజేపీ ప్రభుత్వం డ్రామాలాడుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఓవైపు నిరసనలు చేస్తుంటే.. మరోఈడీ అధికారులు కొత్తవారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెంత మందికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
Also Read This Article : సికింద్రాబాద్ ఎంపీ పోటీ నుంచి దానం నాగేందర్ ఔట్?

Also Read This Article :