అందరు హీరోల సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తోంది కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు రెండు రూపొందుతున్నా ఒక్కదాని నుంచి కూడా నో అప్డేట్. ఫ్యాన్స్ ఆందోళన చెందుతుంటే మే మిడిల్లో టీజర్ విడుదల చేస్తామని దర్శకుడు మారుతి చల్లని కబురందించారు. దీంతో ఫ్యాన్స్ కూల్. కానీ ఇంతలోనే మరో ప్రచారం. ప్రభాస్ అతీగతీ లేకుండా పోయాడని.. ఆయన వచ్చి డబ్బింగ్ చెబితేనే టీజర్ విడుదల అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభాస్ ఎటు వెళ్లారనే విషయమై కూడా ఊహాగానాలు బీభత్సంగానే వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో సమ్మర్ వెకేషన్స్ను ఎంజాయ్ చేస్తున్నారని కొందరు.. కాదు కాదు.. కాలికి సర్జరీ చేయించుకుని విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్నారని మరికొందరు నెట్టింట రచ్చ చేస్తున్నారు. మరి ఈ ఊహాగానాల్లో నిజమెంతనేది తెలియదు కానీ ప్రభాస్ అయితే పత్తా లేకుండా పోయాడు. ఒకవైపు టీజర్ కట్ ఫినిష్ చేసుకుని దర్శకుడు మారుతి ప్రభాస్ రాక కోసం వెయింటింగ్ అట. అసలు ప్రభాస్ గురించి ఇంతలా ప్రచారం జరుగుతున్నా కూడా ఆయన మాత్రం స్పందించడమే లేదు. ఈ ఊహాగానాలన్నింటి మధ్య అసలు టీజర్ విడుదలవుతుందా? లేదా? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
ప్రజావాణి చీదిరాల