పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘కలివి వనం’

వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇదే సందేశంతో రూపొందిన చిత్రమే ‘కలివి వనం’. పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా నాగదుర్గ పరిచయమవుతోంది. ఈ సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర టీజర్‌ రిలీజ్ కార్యక్రమాన్ని తాజాగా మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్ర టీజర్‌ను జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా విడుదల చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె మాట్లాడుతూ.. ‘‘నేను ఈ చిత్రానికి మ్యూజిక్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజ్ అన్నకు, ప్రొడ్యూసర్స్ మల్లికార్జున్, విష్ణువర్ధన్ రెడ్డికి థ్యాంక్స్. నేను ఎక్కువగా మాట్లాడకున్నా, నేను కంపోజ్ చేసిన టీజర్ మాట్లాడుతుంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేశానని భావిస్తున్నా’’ అన్నారు.

నటుడు బలగం సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘సామాజిక స్పృహతో చేసిన సినిమా ‘కలివి వనం’. బలగం చిత్రంతో నాకు ఎంత పేరొచ్చిందో ఈ చిత్రానికి కూడా అలాంటి గుర్తింపే వస్తుందని ఆశిస్తున్నా. సినిమాలో నటించేప్పుడు మా డైరెక్టర్ గారు తనకు కావాల్సిన ఔట్ పుట్ వచ్చేవరకు పనిచేయించారు. అడవుల్లో గుట్టల్లో షూటింగ్ చేశాం. అవన్నీ మంచి ఎక్స్‌పీరియన్స్ గా భావిస్తున్నాం. ప్రకృతి కోసం చేసిన ఇలాంటి ప్రయత్నాన్ని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

నటుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందామనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను డైరెక్టర్ రాజ్ రూపొందించారు. ఈ టీమ్ తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను’’ అన్నారు. నటుడు ఖయ్యూం మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ రాజ్ నరేంద్ర మొదటి హీరోను నేనే. 12 ఏళ్లుగా మేము స్నేహితులుగా ఉన్నాం. యాక్షన్, లవ్, రొమాంటిక్ అంటూ చాలా జానర్స్ మూవీస్ చూస్తుంటాం. కానీ ఈ సినిమాను మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పగలను. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని విష్ చేస్తున్నా’’ అన్నారు.

నిర్మాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు రాజ్ లాగే నాకు కూడా చెట్లంటే ఇష్టం. అందుకే ‘కలివి వనం’ సినిమాను రూపొందించాను. ఈ రోజు మా సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఒక చిన్న ఐడియాగా మొదలైన ఈ మూవీ ఈ రోజు ఇంత బాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. నిర్మాత విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. వాళ్ల సపోర్ట్ తో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు. నటి నాగ దుర్గ మాట్లాడుతూ.. ‘‘పర్యావరణం బాగుండాలని చెప్పే మంచి సందేశమున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే ప్రొడ్యూసర్స్ మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి లేకుంటే ఇలాంటి మూవీ నిర్మాణమయ్యేది కాదు. మా దర్శక నిర్మాతల వల్లే ‘కలివి వనం’ మీ ముందుకు వస్తోంది’’ అన్నారు

దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ.. ‘‘మా చిత్రాన్ని కమర్షియల్ మూవీ కాదు అంటున్నారు కానీ వందశాతం మాది కమర్షియల్ చిత్రమే. పిల్లల నుంచి పెద్దల దాకా చూడాల్సిన సినిమా. మనం వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే ఆకాశం నుంచి అని చెబుతాం. కాదు చెట్ల వల్లే వర్షం వస్తుందని నేర్పించాలి. అప్పుడే చెట్ల విలువ బాల్యం నుంచి పిల్లలు తెలుసుకుంటారు. ప్రేక్షకుల మనసులను తాకే చిత్రమిది. మీ హృదయాలకు చేరువవుతుంది. అలాంటప్పుడు మాది పూర్తిగా కమర్షియల్ చిత్రమే. నేను యూట్యూబ్ లో 300 పాటలు రూపొందించాను. దర్శకుడిగా ఇది నాకు మూడో సినిమా. మా కాసర్ల శ్యామ్ అన్నతో ఈ చిత్రానికి పనిచేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *