ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు.
వయోభారంతో పాటు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మనోజ్ కుమార్ ఎక్కువగా దేశభక్తి సంబంధిత చిత్రాలు తీశారు. దీంతోఆయన భరత్ కుమార్గా ఫేమస్ అయ్యారు.
ఆయన అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో ‘ఫ్యాషన్’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు.
దర్శకుడిగా, రైటర్గా, నటుడిగా 40 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకుసేవలందించారు.
అమితాబ్ బచ్చన్ హీరోగా 1974లో ‘రోటీ కపడా మకాన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
మనోజ్ కుమార్ చిత్రపరిశ్రమకు చేసిన సేవలకుగానూ.. 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు ఆయనను వరించాయి.
మనోజ్ కుమార్ మరణ వార్త తెలిసి సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
ప్రముఖ నటులంతా సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read This : స్పెషల్ స్టోరీ ఎబౌట్ టాలీవుడ్ హీరోయిన్ డాక్టర్స్….