తాజాగా నిర్మాత నాగవంశీ పెట్టిన ఒకే ఒక్క పోస్ట్ నెట్టింట నానా రచ్చ చేసింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చేయనున్న చిత్రాలను ఉద్దేశించి ఆయన సంస్కృతంలో ఒక పోస్ట్ పెట్టారు. త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్లు ఉన్నాయని.. అందులో ఒకటి వెంకటేశ్తోనూ.. మరొకటి ఎన్టీఆర్తో తెరకెక్కించనున్నారని తెలిపారు. ఇంతకు మించి మరే ప్రాజెక్టులూ ఆయన చేతిలో లేవని.. అలా ఉన్నట్టు ఏమైనా వార్తలొస్తే అవి కేవలం ఊహాగానాలేనని నాగవంశీ తేల్చి చెప్పారు. ఒకవేళ ఏమైనా ఉంటే తనే ప్రకటిస్తానన్నారు.
గతేడాది విడుదలైన ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ అధికారికంగా ఏ సినిమానూ ప్రకటించలేదు. అల్లు అర్జున్తో సినిమా చేయనున్నారంటూ వార్తలొచ్చాయి కానీ అది ఎందుకో సైడ్ అయిపోయింది. ప్రస్తుతం బన్నీ.. అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అలాగే రామ్ చరణ్తోనూ త్రివిక్రమ్ సినిమా చేయనున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ ప్రచారాలన్నింటికీ చెక్ పెడుతూ నాగవంశీ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోపై ఆసక్తిని రేకెత్తించార. ఈ సినిమాలో కార్తికేయ భగవానుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడంటూ అంచనాలకు రెక్కలు కట్టేశారు.
ప్రజావాణి చీదిరాల