హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘3 బీహెచ్కే’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోస్టర్లు, టీజర్లు, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇల్లు సొంతం చేసుకోవాలనే జీవిత కాల కల కలిగిన మధ్యతరగతి కుటుంబ భావోద్వేగ ప్రయాణంలో ఈ ట్రైలర్ మనసుని హత్తుకుంది. జీవితంలో వైఫల్యాలు, నిరాశలను ఎదుర్కొన్న తండ్రి, కుటుంబం ఆకాంక్షలను నెరవేర్చడానికి తన కొడుకుపై తన ఆశలన్నింటినీ ఉంచుతాడు.
చదువు పరంగా కష్టపడుతూ, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ 34 సంవత్సరాల వయస్సులో కూడా ఉద్యోగం లేకుండా ఉన్న కొడుకు భావోద్వేగ ప్రయాణం చాలా ఎమోషనల్ గా వుంది. ఆ కుటుంబం కల చివరకు సాకారం అవుతుందా లేదా అనేది చాలా ఆసక్తిని పెంచింది. ఇల్లు కొనడం అనేది మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కథ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంది. దర్శకుడు శ్రీ గణేష్ భావోద్వేగపరంగా హృదయాన్ని తాకే కథనంతో తన మ్యాజిక్ ని ప్రజెంట్ చేశాడు. సిద్ధార్థ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. తన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. తన కుటుంబం ఆనందం, భద్రత గురించి మాత్రమే కలలు కనే ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి పాత్రను శరత్ కుమార్ చాలా చక్కగా పోషించారు. కథకు భావోద్వేగాన్ని జోడించే ఆకట్టుకునే నటనతో దేవయాని, మీతా రఘునాథ్ , చైత్ర ఆకట్టుకున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘‘3 బీహెచ్కే మూవీ ఫ్యామిలీని మీకు పరిచయం చేయాలి. అరుణ్ విశ్వా ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చిన కథ. ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే మా నాన్నని గట్టిగా హగ్ చేసుకోవాలని అనిపించింది. తండ్రి కొడుకుల రిలేషన్షిప్ ని బొమ్మరిల్లు సినిమాల్లో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అలాంటి సినిమా తర్వాత మళ్ళీ తండ్రి కొడుకుల రిలేషన్షిప్ 3 బీహెచ్కే లో చూస్తారు. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఎలాంటి అనుభూతి కలిగిందో మీకు కూడా ఆ అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
యాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా రియల్ లైఫ్ కి చాలా కనెక్ట్ అయ్యే సినిమా. మనందరం కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇల్లు అనేది అందరి కల.ఈ సినిమాతో చాలా రిలేట్ అవుతున్నాను. ఇల్లు కట్టాలని అందరికీ యాంబిషన్ ఉంటుంది. ఇల్లు అనేది ఒక గౌరవం. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చుని చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు. డైరెక్టర్ శ్రీ గణేష్ మాట్లాడుతూ… ‘‘నేను తెలుగు మాట్లాడలేని గాని చాలా తెలుగు సినిమాలు చూశాను. నాకు తెలుగు అర్థం అయిపోతుంది. అదే సినిమాకు ఉన్న బ్యూటీ. తెలుగులో బొమ్మరిల్లు అందరికీ కనెక్ట్ అయింది ఈ సినిమా కూడా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉందని సిద్ధార్థ్ గారు చెప్పారు. అలాగే మా సినిమాకి కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ మాట్లాడుతూ… ‘‘మైత్రి డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. ఇంతకుముందు మహావీరుడు చేశాను. ఆ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు నుంచి వచ్చిన రెస్పాన్స్ స్పెషల్ ఫీలింగు. ఈ సినిమా కూడా అంతకంటే మంచి రెస్పాన్స్ తీసుకొస్తుందని నమ్మకం ఉంది. ఈ పాత్రను చేసిన సిద్ధార్థ్కి థాంక్యూ. తను నాకు బ్రదర్ లాంటి వారు. శరత్ కుమార్ గారికి దేవయాని గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. శ్రీ గణేష్ చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల