నవీన్రాజ్ సంకరపు, పూజా సుహాసిని, శ్రీలు, జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘తెరచాప’. జాయెల్ జార్జ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని కైలాష్ దుర్గం నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ను చూస్తుంటే.. జాలరులకు.. దళారులకు మధ్య జరిగే యుద్ధంలా అనిపిస్తోంది. టీజర్లో ఎక్కువగా రాజీవ్ కనకాల కనిపిస్తున్నారు. ఆయనే మెయిన్ విలన్గా తెలుస్తోంది. ఇక సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘వెయ్యి గడపలు.. అధికారపు అహం.. మంటల్లో కాలిపోయి శ్మశానంగా మారితే’ అంటూ సాగే వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమవుతుంది. ‘సముద్రంలో ఏటకెళ్లడమంటే వలేసి సేపలనట్టుకోవడం కాదు.. సొరలతో యుద్ధం సెయ్యాల..’ అనే డైలాగ్స్తో మేకర్స్ టీజర్ను కట్ చేశారు. ఈ సినిమాలో నాగ మహేశ్, పృథ్వీ రాజ్, ఫిష్ వెంకట్, అశోక్ జబర్దస్త్, నాగి జబర్దస్త్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రజావాణి చీదిరాల