Odela 2: ఓటీటీలోకి ‘ఓదెల 2’ వచ్చేది ఎప్పుడంటే..

ఏంటో కొన్ని సినిమాలు ఇలా థియేటర్లలోకి వచ్చి.. అలా ఓటీటీలోకి వచ్చి సెటిల్ అయిపోతాయి. రోజుకో కొత్త సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఇప్పుడు ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా వచ్చిన ‘ఓదెల 2’ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. తమన్నా, వశిష్ట, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అశోక్ తేజ రూపొందించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఏప్రిల్ 17న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా నెల రోజులకు అంటే మే 17న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. కథలో బలం లేకపోవడంతో ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేక పోయింది. ఇక కథ విషయానికి వస్తే.. ఓదెలలో తిరుపతి అనే కామాంధుడు కొత్తగా పెళ్లైన అమ్మాయిల్ని మానభంగం చేస్తుంటాడు. దీంతో అతని భార్య అతడిని చంపేస్తుంది. గ్రామస్తులంతా కలిసి అతనికి సమాధి శిక్ష వేస్తారు. ఆ తరువాత కథ ఏ మలుపు తీసుకుంటుంది? శివశక్తి అలియాస్ భైరవి దుష్ట సంహారం ఎలా గావిస్తుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *