టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి గత కొంతకాలంగా ఏం చేసినా ట్రోల్ అవుతూనే ఉంది. కూతురుతో కలిసి ఆమె చేసిన వీడియోలతో విపరీతంగా ట్రోలింగ్కు గురైన ఆమె తాజాగా మరోసారి హాట్ టాపిక్గా మారింది. తాజాగా సురేఖా వాణి టాటూ వేయించుకుంది. ఆమెకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి. ఈ క్రమంలోనే వేంకటేశ్వర స్వామివారి పాదుకలను, గోవింద నామాలను కుడి చేతిపై టాటూవేయించుకుంది. ఇదంతా సర్వసాధారణం. ఇటీవలి కాలంలో అంతా టాటూలు వేయించుకుంటున్నారు.
అయితే దీనికి సంబంధించిన వీడియోను సురేఖా వాణి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో సురేఖా వాణి నొప్పితో బాధపడుతుంటే.. ఆమె కూతురు సుప్రీత మాత్రం క్లాప్స్ కొడుతూ ధైర్యం చెబుతోంది. చివరిలో టాటూ చూసి తన కష్టమంతా మరచిపోయానని.. తన ముందు తన పెదబాబు నడుస్తుంటే వెనుక తను నడుస్తానని.. గోవిందా గోవిందా.. అని సురేఖ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనిని చూసిన కొందరు నెటిజన్లు సురేఖా వాణి ఓవరాక్టింగ్ చేస్తోందంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మొత్తానికి వీడియో అయితే తెగ వైరల్ అవుతోంది.