చెన్నై నడ్డి విరిచిన హర్షల్ పటేల్

చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 43 మ్యాచ్లో చెన్నై జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.5 ఓవర్లలో 154 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. సన్రైజర్స్ బౌలర్ హర్షల్ పటేల్ 4 ఓవర్స్ బౌల్ చేసి 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయటంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తక్కువ స్కోరుకి చాప చుట్టేసింది. తరవాత బ్యాటింగ్ కు వచ్చిన హైదరాబాద్ జట్టు రెండో బంతికే పరుగులేమీ చేయకుండా వెనుతిరగడంతో చెన్నై జట్టు మ్యాచ్ పై పట్టు సాధించింది. ఒక దశలో చెన్నై గెలుస్తుందేమో అనేలా ఆ టీమ్ పెర్ఫార్మ్ చేసింది. టాప్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్ ఒక్కడే 34 బంతుల్లో 44 పరుగులు ( 5 ఫోర్లు 1 సిక్సర్) సాధించాడు. మిగతా అందరూ చేతులెత్తేయడంతో ఈ మ్యాచ్ కూడా సన్రైజర్స్ చేయి జారటం ఖాయం అనుకున్నారంతా. ఒక దశలో 14 ఓవర్లలో 106 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత వికెట్ నష్టపోకుండా మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు హైదరాబాద్ జట్టు బాట్స్మన్స్ నితీష్ కుమార్ రెడ్డి ( 19 పరుగులు) మరియు కమిండు మెండిస్ (32 పరుగులు) చేసి మ్యాచ్ ముగించారు. హర్షల్ పటేల్కు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *