వర్షార్పణం ఐన ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్.

హైదరాబాద్ లో జరిగిన ఐపీఎల్ 55 వ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ కు వచ్చిన అయిదుగురిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అటువంటి క్లిష్ట సమయంలో స్టబ్స్ 36 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 41 పరుగులు, విప్రాజ్ నిగమ్ 17 బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు , అశుతోష్ 26 బంతుల్లో 2 ఫోర్స్ 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ పరువు కాపాడి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది . తర్వాత బ్యాటింగ్ ప్రారంభిచాల్సిన ఎస్ ఆర్ ఎచ్ ఇన్నింగ్స్ ఆరంభం కాకుండానే ఉప్పల్ స్టేడియంలో వర్షం కురవడంతో మ్యాచ్ రద్దు అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్ సన్రైజర్స్జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ 4 ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టగా ఢిల్లీ టాప్ ఆర్డర్ కుప్పకూలింది.

Also Read This : చివరి ఓవర్‌లో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన పంజాబ్ కింగ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *