దర్శకుడు త్రినాథరావు నక్కిన ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్లోకి అడుగుపెడుతున్నారు.
ఈ సినిమా క్రైమ్-కామెడీ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాతో హీరోగా ఇంద్రా రామ్ పరిచయం కానున్నాడు.
పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో నిఖిల్ గొల్లమారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
నక్కిన నెరేటివ్ బ్యానర్పై ఈ సినిమా రూపొందింది.
ఇటీవల నాగ చైతన్య ‘ఆడ పిశాచం’ అనే పాటను విడుదల చేయగా..
తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రం నుంచి ‘ఒక్కసారిగా’ సాంగ్ లాంచ్ చేశాడు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, మస్త్ అలీ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘లెవన్’ ఎప్పుడు వస్తోందంటే..