మరోసారి ‘పాడుతా తీయగా’పై ఆరోపణలు చేసిన సింగర్ ప్రవస్తి..

సింగర్ ప్రవస్తి.. ఆ మధ్య సింగింగ్ రియాలిటీ షో పాడుతా తీయగాలో తనను బాడీ షేమింగ్ చేశారంటూ.. ఇంకా ఏవేవో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తన ఎలిమినేషన్‌కు సింగర్ సునీతే కారణమంటూ నేరుగా ఆరోపించింది. ఆ తరువాత సైలెంట్ అయిపోయింది. తాజాగా ఆమె ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆ షోలో టెలికాస్ట్ అయ్యింది. దానిలో ముగ్గురు జడ్జిలైన సునీత, చంద్రబోస్‌, కీరవాణి చప్పట్లు కొడుతూ కనిపించారు. దీనిపై ఓ వీడియో ద్వారా ప్రవస్తి స్పందించింది. మరోసారి ఆరోపణలు చేసింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనే అనుకున్నానని.. కానీ ఆ ఎపిసోడ్ చూశాక స్పందించాలనిపించిందని వెల్లడించింది.

ఆ ఎపిసోడ్‌ చూసి చాలా షాకయ్యానని.. ఒక రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఎడిటింగ్‌లు చేసి ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ చేస్తారనుకోలేదని తెలిపింది. చాలా మంది రియలైజ్ అయ్యి తనకు మెసేజ్‌లు చేస్తున్నారని.. మిగిలిన ఎలిమినేషన్స్‌తో పోల్చుకుంటే మీది అనైతికమని చెబుతున్నారని పేర్కొంది. ఎడిటింగ్ చేసి జనాలను సునాయాసంగా మోసం చేయవచ్చనేది వారి ఉద్దేశమని తెలిపింది. తన ఎలిమినేషన్ ఎపిసోడ్‌లో సునీత మేడమ్ తప్ప మిగిలిన జడ్జిలు లేరని తాను అప్పట్లో చెప్పానని కానీ ఎపిసోడ్‌లో వారు ముగ్గరూ ఉన్నట్టు.. చప్పట్లు కొడుతున్న సీన్ పెట్టారని తెలిపింది. అదెలా అతికించారో తనకు తెలియదని వెల్లడించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *