రంగం ఏదైనా సరే.. వన్స్ తప్పుకుంటే జనాల దృష్టిలో నుంచి తొలగిపోయినట్టే. కానీ కొందరి జాతకం ఏంటో కానీ దూరంగా ఉన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ సమంత మాత్రం లోకల్ అన్నట్టుగా పాతుకు పోయింది. ఈ ముద్దుగుమ్మ దాదాపుగా రెండేళ్లుగా వెండితెరపై మెరవకున్నా కూడా అమ్మడికి అవార్డులు, రివార్డులు దూరం కావడం లేదు. తాజాగా కోలీవుడ్లో అమ్మడికి గోల్డెన్ క్వీన్ పురస్కారాలలో గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్తో తన అనుబంధాన్ని పంచుకుంది.
తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు తనతో ఉండి జాగ్రత్తగా చూసుకున్నాడని తెలిపింది. రాహుల్ రవీంద్రన్తో ఉన్న అనుబంధాన్ని పేరు పెట్టలేనని.. అతను తనకు స్నేహితుడా.. సోదరుడా.. కుటుంబ సభ్యుడా.. రక్త సంబంధీకుడా.. అనేది చెప్పలేనని పేర్కొంది. అభిమానుల గురించి మాట్లాడుతూ.. ఇంత మంది అభిమానులను సొంతం చేసుకోవడం తన అదృష్టంతో పాటు తాను పడి కష్టం, దేవుడిచ్చిన వరంగా భావిస్తానని తెలిపింది. మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేమని ఒకవేళ ఎవరైనా డిసైడ్ చేసినా కూడా అది జరగదని సమంత పేర్కొంది. తెలిసీ తెలియక తీసుకున్న నిర్ణయాలు కెరీర్పై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.
Also Read This : ఎన్టీఆర్-నీల్ కాంబోపై క్రేజీ అప్డేట్..