Sairabanu :
వాళ్లను వదిలేద్దాం..వారిష్టానికి వారినుండనిద్దాం…
భారతదేశమంతా మా సంగీత దర్శకుడు అని గర్వంగా చెప్పుకునే ప్రపంచ ప్రఖ్యాత మ్యుజీషియన్ ఏఆర్ రెహమాన్.
ఆయన తన శ్రీమతి సైరాభానుల పెళ్లి బంధానికి 29 ఏళ్ల తర్వాత ముగింపు పలికిన సంగతి తెలిసిందే.
అది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారం. అది వారి స్వేచ్ఛ. వారు కలిసి ఉండొచ్చు, విడిపోవచ్చు.
అది రాజ్యాంగం వారికి కల్పించిన పూర్తి హక్కు. వారి వ్యక్తిగత జీవితం గురించి అనేక మీడియాలు చిలువలు పలువలుగా వార్తలు గుప్పిస్తున్నాయి.
వాటన్నింటిని భరించిన రెహమాన్ తనకు వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కథనాలు అల్లితే న్యాయపరంగా తగు చర్చలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఎంతో మనోవేధనకు గురైన తర్వాత ఆయన గురించి మాట్లాడితే ఊరుకోను అని ఘాటుగానే స్పందించారు.
గత వారం రోజులుగా వారిద్దరి విషయాల గురించి మీడియాలో అందరూ మట్లాడుతుంటే ఈ రోజు సైరాభాను తొలిసారి స్పందిచి ఒక లేఖను విడుదల చేశారు.
ఆమె మాటల్లో ఎంతో మెచ్యూరిటీ ఉంది.
ఆమె మాట్లాడుతూ : ‘‘ నా భర్త ఎంతో అద్భుతమైన మనిషి. మేము చాలా ఏళ్లు ఆనందగా గడిపాము.
మా డైవోర్స్కు రీజన్ నా హెల్త్ కండిషన్ మాత్రమే తప్ప మరోకటి కాదు అంటూ ఆమె ఎంతో మెచ్యూర్గా మాట్లాడిన తీరు చూస్తే ముచ్చటేస్తుంది.
ముఖ్యంగా ఎవరి పనులు వారు చూసుకోకుండా పక్కవారి జీవితాల గురించి ఆలోచించటం మానేస్తే బావుంటుంది అనేది సైరాభాను ఉద్ధేశ్యం.
ఈ విషయానికి సంబంధించిన వీడియో క్రిందనున్న లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.
శివమల్లాల
Also Read This : ఇండస్ట్రీకి మరో పదహారణాల తెలుగమ్మాయి…
