హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తమ్ముడు’. డైరెక్టర్ శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం జులై 4న బాక్సాఫీసు ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేసింది. ముందుగా లయ, సప్తమీ గౌడ, స్వాసిక ముగ్గురూ సోఫాలో కూర్చొని ఉంటుంది. అప్పుడు అక్కడికి వర్షా బొల్లమ్మ వచ్చి కూర్చుంటుంది. ఫోన్లో ‘నేను ఆ రోజు గట్టిగా అడగడం వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ గురించి అడిగితే అది కూడా చెప్పేస్తారు. అట్లుంటది మనతోని’ అని చెబుతుంది. అప్పుడు లయ.. ‘నేను గట్టిగా అడిగినందువల్లే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు’ అని చెబుతుంది. అప్పుడు హీరోయిన్ సప్తమీ గౌడ, స్వాసిక కూడా మేము చెప్పామని అంటారు. ఈ మాట విన్న లయ ‘అసలు మీరిద్దరు ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. ‘వేరే సినిమాలో నటించి.. ‘తమ్ముడు’ అనుకున్నారా?’ అంటూ వర్ష బొల్లమ్మ ఎద్దేవా చేస్తుంది. సరదాగా సాగే ఈ కాన్వర్సేషన్ చివరిలో దర్శకుడు ఎంట్రీ ఇచ్చి.. అన్నింటికీ సమాధానం ట్రైలర్ అని, అది ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు విడుదలవుతుందని తెలిపారు.