గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే చిత్రం యూనిట్, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ బ్లాక్ను పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో భారత సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది.
ఇది ఇండియన్ యాక్షన్ సినిమాల ప్రమాణాలను పెంచేలా ఉన్న హై-ఆక్టేన్, హై బడ్జెట్తో రూపొందిస్తున్న ట్రైన్ ఎపిసోడ్. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అద్భుతంగా సెట్స్ని డిజైన్ చేశారు. ఈ ట్రైన్ స్టంట్ కోసం రూపొందించిన సెట్స్ కన్నులకు పండుగగా ఉండబోతున్నాయి. ఈ ఎపిసోడ్లో రామ్ చరణ్ తన కెరీర్లోనే అత్యంత రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మైండ్-బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్గా వుండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల