దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకు ను ఛేదించిన పంజాగుట్ట పోలిసులు..

Hyderabad Drugs Case :

పాలస్తీనా కి చెందిన సయూద్ అలీ, ముంబై కి చెందిన రోమి లను అరెస్ట్ చేసిన పోలీసులు..

నిందితుల నుంచి 4.75 గ్రాముల ఎక్స్టసి పిల్స్, 5.18 గ్రాముల ఎం డి ఎం ఏ, 109 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం..

నిందితులకు హైదరబాద్, ఢిల్లీ, బెంగళూరు, గోవా లోని డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు..

నిందితుల లిస్ట్ లో హైదరాబాద్ కి చెందిన 31 మంది వినియోగ దారులు..

స్టూడెంట్ విసా పై వచ్చి హైదరబాద్ లో నివాసం ఉంటున్న సయూద్..

సయూద్ ఆర్డర్ మేరకు గోవా లోని క్రిస్ నుంచి కొనుగోలు చేసి అందిస్తున్న రోమీ..

రెండు రోజుల క్రితం పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద సయూద్ కి రోమి విక్రయిస్తున్న సమయంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..

స్మగ్లర్లు, వినియోగ దారుల కోసం గాలిస్తున్న పోలీసులు..

 

 

Also Read This Article : విజయశాంతి అడ్రస్సెక్కడ?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *