తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. 42 బంతుల్లో 67 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 32 బంతుల్లో 64 పరుగులు చేసిన రజత్ పటిదార్ తో కలిసి జితేష్ శర్మ 19 బంతుల్లో 40 పరుగులు చేయటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టి 221 పరుగులు చేసింది బెంగళూరు జట్టు. చేజింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు మొదటి ఓవర్లోనే అంటే పవర్ ప్లే లోనే 54 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ముంబై ఇండియన్స్ జట్టు 12 ఓవర్ల వరకు ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత బ్యాటింగ్ కు దిగిన హార్ధిక్ పాండ్యా క్రీజ్ లో ఉన్నంతవరకు ముంబై ఆశలు సజీవంగా ఉన్నాయి.
ఒక దశలో ముంబై గెలుస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ చివరి ఓవర్ లో ఆర్సీబీ జట్టు విజయం ముందు నిల్చుంది. ఓ వైపు తిలక్ వర్మ మరో పక్క హార్దిక్ మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ జట్టు గట్టిగానే పోరాట పటిమను ప్రదర్శించింది. చివరి ఓవర్ కృణాల్ పాండ్యా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశాడు. 12 పరుగుల తేడాతో ముంబై ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైంది. పటీదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా బ్యాటింగ్ లోను కృణాల్ పాండ్యా వేసిన బౌలింగ్లోను రాణించడం ఆర్సీబీ టీంకు కలిసొచ్చింది. 4 వికెట్స్ చేజిక్కించుకున్న కృణాల్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంటాడు అనుకుంటే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.