రాజీవ్ కనకాల , ప్రమోదిని మురుగన్, గాయత్రి భార్గవి ముఖ్యపాత్రల్లో కథాసుధలో భాగంగా నటించిన షార్ట్ ఫిలిమ్ ‘మౌనమో నీభాష’. సుచేత డ్రీమ్ వర్క్స్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మించగా దర్శకరచయిత వర ముళ్లపూడి దర్శకత్వంలో విడుదలవుతున్న ఈ 30 నిమిషాల షార్ట్ ఫిలిమ్ సెప్టెంబర్ 7వ తేదినుండి ఈటీవి విన్లో స్ట్రీమింగ్ జరగనుంది. ఈ సందర్భంగా దర్శకుడు వర ముళ్లపూడి మాట్లాడుతూ–‘‘ మాటలు మౌనంలో కలిసినప్పుడు, మౌనంలో మనసు మునిగినప్పుడు, బాధలు మాటలకి అందనప్పుడు మాటలు మరచిన మనసుకు …మౌనమో భాష మా ఈ మౌనమో నీభాష’’ అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ–‘‘ ఎన్నో భావోద్వేగాలున్న ఈ షార్ట్ ఫిలిమ్ ఎప్పుడెప్పుడు మీరందరూ చూసి నన్ను, నా నటనని ఆదరిస్తారని ఎదురు చూస్తున్నా’’ అన్నారు.