K.Keshava Rao :
ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి
బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. శుక్రవారం కేకే పలువురు నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. దాదాపు అరగంట పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. ఇంతకుముందే దీపాదాస్ మున్షీ… కేశవ రావుతో పాటు ఆయన కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం కేశవరావు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేశవరావు వ్యవహారంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక కేకేతో పాటు ఆయన కుమార్తె విజయలక్ష్మి ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.కే కేశవరావు… కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్న సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు.
టిఆర్ఎస్లో కీలక నేతగా ఎదిగారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి కేసీఆర్ తో కలిసి పని చేస్తూ వచ్చారు. పార్టీలో కూడా ఆయనకు అధికా ప్రాధాన్యత లభించింది. రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఉన్నారు. మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కేకే…. బీఆర్ఎస్ పార్టీలో కూడా సీనియర్ నేతగా మెలిగారు. కేసీఆర్ కుమార్తె గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్ స్థానాన్ని కట్టబెట్టింది. తే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావటంతో… పరిణామాలన్నీ మారిపోయాయి. కేవలం 39 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీగా ఉంది.
Also Read This Article : వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి?