ఐపీఎల్ 18 వ సీజన్ 52 వ మ్యాచ్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 214 పరుగులు చేసింది. జాకబ్ బెథాల్ 33 బంతుల్లో 55 పరుగులు (8 ఫోర్లు , 2 సిక్సర్లు) విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 66 పరుగులు ( 5 ఫోర్లు 5 సిక్సర్లు) 9.5 ఓవర్లలో 97 పరుగులు తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవరు పెద్దగా రాణించలేదు. 7 వ నంబర్ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రొమారియో షేఫెర్డ్ 14 బంతుల్లో 53 పరుగులు ( 4 ఫోర్లు,6 సిక్సర్లు) చెలరేగి ఆడి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నాట్ అవుట్ గా నిలిచిన రొమారియో వల్ల బెంగళూరు రాయల్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ ఆయుష్ మాత్రే 48 బంతుల్లో 94 పరుగులు (9 ఫోర్స్ 5 సిక్సర్లతో) చేసి చెన్నై ఆశలను సజీవంగా ఉంచాడు. 4 వ నంబర్ బాట్స్మన్ గా బరిలోకి దిగిన రవీంద్ర జడేజా ( 45 బంతుల్లో 77 పరుగులు ( 8 ఫోర్లు 2 సిక్సర్లు) సాధించి చివరి బంతి వరకూ పోరాడాడు. కానీ ఒక్క పరుగు తేడాతో చెన్నై విజయం చేజారింది. వరుసగా చెన్నై టీంను కాసేపు, బెంగళూరు జట్టు ను కాసేపు విజయం ఊరించింది. ఆఖరి బంతికి విజయం సాధించిన బెంగళూరు జట్టు ఊపిరి పీల్చుకుంది. 11 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. వరుసగా హాఫ్ సెంచరీలు నమోదు చేసిన విరాట్ ను బెంగళూరు జట్టు ఫాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.