‘సలార్’ తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ సూపర్ ఫాస్ట్గా విడుదలవుతాయని అంతా భావించారు. దీనికి కారణం ప్రభాస్ ఒక్క సినిమాను పట్టుకుని ఉండటమే కాకుండా ఒక్కసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. మరో రెండు సినిమాలకు సైన్ చేసి ఉన్నాడు. ‘రాజాసాబ్’ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదల కాలేదు. ఎందుకన్న క్లారిటీ కూడా లేదు. నిర్మాణ సంస్థ సైతం దీని గురించి స్పందించిందే లేదు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఏడాది ఈ సినిమా వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
తాజాగా దర్శకుడు మారుతిని ఈ విషయమై ట్విటర్ వేదికగా ప్రభాస్ అభిమానులు ప్రశ్నించారు. దీనికి మారుతి.. రిలీజ్ అనేది తన ఒక్కడి చేతుల్లో లేదని.. ఏ అప్డేట్ అయినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇస్తుందని తెలిపారు. అయితే షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని వెల్లడించారు. టాకీ పార్ట్ కూడా కొంత బాకీ ఉందట. ఈ సినిమా కోసం చాలా గ్రాఫిక్ సంస్థలు పని చేస్తున్నాయి కానీ కొన్ని సంస్థలు ఇచ్చిన అవుట్పుట్ బాగుందన్నారు. షూటింగ్ పూర్తవగానే ఒక్కో అప్డేట్ ఇస్తామని తెలిపారు. తమ కష్టాన్ని చూపించేందుకు తాము సైతం సిద్ధంగా ఉన్నామని మారుతి వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల