అలా మహేష్‌కు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ అయిపోయారట..

‘ఎస్ఎస్ఎంబీ 29’.. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న రాజమౌళి – మహేష్ బాబు కాంబో చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి అయితే ఒక్కటంటే ఒక్క అప్‌డేట్‌ను కూడా బయటకు రానివ్వడం లేదు కానీ కొన్ని వార్తలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం మేకర్స్.. స్టార్ హీరో విక్రమ్‌ను సంప్రదించారట. ఆయన మాత్రం సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇంత పెద్ద చిత్రంలో ఛాన్స్‌ను రిజెక్ట్ చేయడమేంటా? అని ఆశ్చర్యం కలగవచ్చు.

దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మేకర్స్ విక్రమ్‌ను సంప్రదించారట. అందుకే ఆయన రిజెక్ట్ చేశారట. దీంతో మేకర్స్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ను సంప్రదించారని టాక్. మొత్తానికి అలా పృథ్వీరాజ్.. మహేష్‌కు విలన్ అయిపోయారట. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రాజమౌళి ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే ఆర్ మాధవన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారట. త్వరలోనే ఆయన సెట్స్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *